యల్లంపల్లిలో ఏనుగుల గుంపు హల్చల్
చంద్రగిరి
చంద్రగిరి మండలం, ఎల్లంపల్లెలో ఏనుగుల మంద కలకలం రేపింది. గత వారం రోజులుగా గ్రామంలోనే గజరాజులు తిష్ఠ వేశాయి. రాత్రి వేళల్లో పంట పొలాలపై ఏనుగులు
విరుచుకుపడుతున్నాయి. ఏనుగుల దాడిలో పంటలు దెబ్బతిన్నాయి. ఏనుగుల నుంచి తప్పించుకునే క్రమంలో పశువుల కాపరి ముత్తు రామయ్యకు గాయాలయ్యాయి. గజరాజుల సంచారంతో ఎల్లంపల్లె గ్రామస్తులు భయాందోళనతో బతుకుతున్నారు.
ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు ఫారెస్ట్
అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు
అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు
హెచ్చరించారు.
