తిరుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం
తిరుమల
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలు పుష్ప గుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, నరేష్, జంగా కృష్ణమూర్తి, జానకిదేవి, జేఈవోలు వీరబ్రహ్మం, ఏ.శరత్, టీటీడీ సీవీఎస్వో మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
